టెలిమెట్రీ ఫేజ్​2 ఏర్పాటుకు నిధులివ్వండి

టెలిమెట్రీ ఫేజ్​2 ఏర్పాటుకు నిధులివ్వండి
  •  తెలంగాణ, ఏపీలకు కేఆర్ఎంబీ లేఖ

హైదరాబాద్​, వెలుగు :  టెలిమెట్రీ సిస్టమ్​ఫేజ్ 2 అమలుకు నిధులు విడుదల చేయాల్సిందిగా తెలంగాణ, ఏపీలను కేఆర్ఎంబీ కోరింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల లెక్కలను కచ్చితంగా అమలు చేయాలన్నా, రెండు రాష్ట్రాలకు లాభం కలగాలన్నా టెలిమెట్రీ సిస్టమ్స్​తోనే సాధ్యమవుతుందని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ఇరిగేషన్​ సెక్రటరీ, ఏపీ ఇరిగేషన్​ సెక్రటరీలకు కేఆర్ఎంబీ లేఖ రాసింది. 

సైడ్​ లుకింగ్​ డాప్లర్​ కరెంట్​ ప్రొఫైలర్స్​ (ఎల్డీసీపీ)లతో కూడిన టెలిమెట్రీ స్టేషన్స్​ ఫేజ్​2 ఏర్పాటుకు 2018 అక్టోబర్​16, 2020 జూన్​ 4న జరిగిన బోర్డు మీటింగ్​లలో నిర్ణయం జరిగిందని వివరించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.6.25 కోట్ల నిధులకు అడ్మినిస్ట్రేటివ్​ అప్రూవల్​ ఇచ్చినా నిధులను విడుదల చేయలేదని తెలిపింది. ఎస్ఎల్డీసీపీల ఏర్పాటుకు నిధులను విడుదల చేయాలని ఇరు రాష్ట్రాలను కోరింది.