ముగిసిన పారికర్ అంత్యక్రియలు

ముగిసిన పారికర్ అంత్యక్రియలు

ఆదివారం అనారోగ్యంతో చనిపోయిన గోవా దివంగత సీఎం మనోహర్ పారికర్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ముగిశాయి. గోవాలోని మిరామర్ బీచ్‌లో పారికర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తమ అభిమాన నేతకు  కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. పారికర్ అంతిమయాత్రలో ప్రజలు పాల్గొన్నారు.