క్రీడలతో భవిష్యత్తు: రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్

క్రీడలతో భవిష్యత్తు: రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్

ఓల్డ్​సిటీ, వెలుగు: క్రీడల వల్ల స్టూడెంట్స్​కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర బీసీ కార్పొరేషన్​ చైర్మన్​ నూతి శ్రీకాంత్​గౌడ్​అన్నారు. మంగళవారం లాల్​ బహదూర్​ ఇండోర్​ స్టేడియంలో తెలంగాణ జూడో అసోసియేషన్​ రాష్ట్ర చైర్మన్,​ రాష్ట్ర ఫిషరీస్​ కార్పొరేషన్​ చైర్మన్​ మెట్టు సాయి కుమార్​ ఆధ్వర్యంలో రెండో రోజు నిర్వహించిన సబ్​ జూనియర్​ చాంపియన్​షిప్​ అండర్​‌‌‌‌‌‌55 కేజీల పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల అమలుతో  పాటు క్రీడల రిజర్వేషన్లనూ పెంచుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అజీజ్, ఫరూఖి తదితరులు పాల్గొన్నారు.