పద్మారావునగర్, వెలుగు: గాంధీ మెడికల్ కాలేజీ అసిస్టెంట్ డైరెక్టర్గా జి.శ్రీనివాస్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఆరేండ్లు ఆయన నల్గొండ మెడికల్ కాలేజీ ఏడీగా పని చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమయపాలన, చిత్తశుద్ధితో పనిచేస్తూ కళాశాలలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ముగిసిన క్యాన్సర్ నిర్ధారణ సదస్సు
సికింద్రాబాద్గాంధీ మెడికల్ కాలేజీ, టాటా మెమోరియల్ ట్రావెలింగ్ స్కూల్ ఆఫ్ ఆంకో పాథాలజీ సంయుక్తంగా నిర్వహించిన మూడు రోజుల రాష్ట్రస్థాయి క్యాన్సర్ నిర్ధారణ సదస్సు శనివారం ముగిసింది. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ఇందిర, సూపరింటెండెంట్ ప్రొఫెసర్వాణి మాట్లాడుతూ.. ఇలాంటి సదస్సులు డాక్టర్లు, స్టూడెంట్లకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన పెంచుతాయని తెలిపారు. డాక్టర్ సుమిత్ గుజ్రాల్ నేతృత్వంలోని బృందం ప్రజెంటేషన్ఇవ్వగా.. రాష్ట్రం నుంచి సుమారు 250 మంది వైద్యులు, విద్యార్థులు హాజరయ్యారు.
