జీ20 సమిట్.. కమాండో ఆపరేషన్లు చేసిన జవాన్లు

జీ20 సమిట్.. కమాండో ఆపరేషన్లు చేసిన జవాన్లు

జీ–20 సమిట్​కు ఢిల్లీ సిద్ధమవుతోంది. 19 దేశాల అధ్యక్షులు, యూరోపియన్ యూనియన్ కూటమిలోని 27 దేశాల ప్రెసిడెంట్లు, ప్రతినిధులతో పాటు 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు జీ20 సమిట్​కు అటెండ్ అయ్యేందుకు ఢిల్లీకి వస్తున్నారు. ఈ నెల 9, 10వ తేదీల్లో ఈ సమిట్ జరగనుంది.ఈ నేపథ్యంలో సుమారు 10వేల మంది అతిథులు వస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నది. 

భద్రతా సిబ్బందిలో కొందరు కమాండో ఆపరేషన్లలో ఆరితేరిన జవాన్లు కూడా ఉన్నారు. అత్యాధునిక ఆయుధాలపై ట్రైనింగ్ తీసుకున్న మహిళా కమాండోలను కూడా రంగంలోకి దించారు. ఏదైనా విపత్తు సంభవిస్తే వెంటనే రంగంలోకి దిగేందుకు 400 మంది ఫైర్ సిబ్బందితో పాటు 450 క్విక్ రియాక్షన్ టీమ్స్‌‌ను సిద్ధం చేశారు. ఎక్కడికక్కడ అంబులెన్సులు, ఫైరింజన్లు మోహరించారు. కెమికల్, రేడియోలాజికల్, వెపన్స్ అటాక్, ఏరియల్ అటాక్, ప్రొటెస్ట్స్ ఇలా.. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా దీటుగా ఎదుర్కొనేలా భద్రత ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం 10 వేల మంది పోలీసులు డ్యూటీలో ఉంటారు. బీఎస్ఎఫ్, సీఆర్​పీఎఫ్, ఎన్​ఎస్​జీ, ఎస్​పీజీ, ఐబీ, రా, ఎస్​ఎస్​బీ, హిట్ స్క్వాడ్స్, బాంబ్ స్క్వాడ్, యాంటీ డ్రోన్ టీమ్స్​విధుల్లో ఉంటారు.