- స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బార్ అసోసియేషన్ వినతి
వికారాబాద్, వెలుగు : వికారాబాద్ జిల్లా కోర్ట్ భవన నిర్మాణానికి భూమిని కేటాయించాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆయనను మర్యాద పూర్వకంగా కలిసిన వినతి పత్రం అందజేశారు. వికారాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ... జిల్లా కేంద్రం లో కోర్ట్ భవనానికి సర్వే నంబర్లు 296, 302,303,304, 306 లో భూమి ఎన్నేపల్లి పరిధిలోని హార్టికల్చర్ శాఖకు చెందిన భూమిలో నుంచి 15 ఎకరాలను జిల్లా కోర్టు భవనానికి కేటాయించాలని కోరారు.
స్పీకర్ ను కలిసిన వారిలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ ఖయ్యూం, న్యాయవాదులు గోవర్ధనరెడ్డి, శ్రీనివాసరావు, బాలయ్య, శంకరయ్య, రవీందర్, పరశురాం, రాజు, నర్సింహులు, అనిల్ కుమార్, సాయిరాం, సంజీవ్, శేఖర్ తదితరులు ఉన్నారు.