కాకా స్ఫూర్తితో ప్రజలకు సేవలందిస్తా : గడ్డం వంశీకృష్ణ

కాకా స్ఫూర్తితో ప్రజలకు సేవలందిస్తా : గడ్డం వంశీకృష్ణ
  •     పెద్దపల్లి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ

గోదావరిఖని, వెలుగు: మాజీ కేంద్ర మంత్రి,  కాకా వెంకటస్వామి స్ఫూర్తితో ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తానని పెద్దపల్లి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం రాత్రి రామగుండం కార్పొరేషన్​ పరిధిలోని 13వ డివిజన్‌‌‌‌ విఠల్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్యే సతీమణి మనాలీ ఠాకూర్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు వారికి మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ కాకా నాలుగు సార్లు పెద్దపల్లి ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఈ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలందించారని గుర్తుచేశారు. 

సింగరేణి అప్పుల్లో ఉన్నప్పుడు ఎన్టీపీసీ నుంచి రూ.450 కోట్ల రుణం ఇప్పించి లక్ష ఉద్యోగాలు పోకుండా కాపాడారన్నారు. బీఆర్ఎస్​ పాలనలో ఆ పార్టీ లీడర్లు భూ కబ్జాలు, దందాలు, దాడులకు పాల్పడి రాష్ట్రాన్ని దోచుకున్నారని ఫైర్​ అయ్యారు. మనాలీ ఠాకూర్​ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్​ ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్​ పార్టీకి ఓటు వేసి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ లీడర్లు చుక్కల శ్రీనివాస్​, ఎండి ముస్తాఫా, రాము, శోభ, రాణి, తదితరులు పాల్గొన్నారు.