పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ గెలుపు ఖాయం

పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ గెలుపు ఖాయం
  • రామగుండం, యైటింక్లయిన్​ కాలనీల్లో పార్టీ నేతల ప్రచారం

గోదావరిఖని/జ్యోతినగర్/ యైటింక్లయిన్​ కాలనీ, వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్​ ఎంపీ క్యాండిడేట్​ గడ్డం వంశీకృష్ణ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. శనివారం రామగుండం, యైటింక్లయిన్​ కాలనీల్లో కాంగ్రెస్​ అభ్యర్థి తరపున విస్తృత ప్రచారం చేశారు. రామగుండం పట్టణంలోని ముస్లిం కుటుంబాలను ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్​ సతీమణి మనాలీ ఠాకూర్​ కలిసి చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 

అలాగే యైటింక్లయిన్​ కాలనీలో జరిగిన కార్యక్రమంలో యూత్​ కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు జెమిని గౌడ్, పట్టణ అధ్యక్షుడు హరిహర నాయక్​ ఆధ్వర్యంలో కాంగ్రెస్​ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కరపత్రాన్ని రిలీజ్​ చేశారు. ఆదివారం నుంచి యైటింక్లయిన్​ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ వంశీకృష్ణ గెలుపు కోసం విస్తృత ప్రచారం చేస్తామని తెలిపారు. లీడర్లు వెంకటేశ్, అఖిల్, మారుతి, విజయ్, అనిరుధ్, రవి, గౌతమ్, హరినివాస్ పాల్గొన్నారు. 

ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో..

పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్​ క్యాండిడేట్​ గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరుతూ ఐఎన్టీయూసీ నేషనల్​ సీనియర్​ సెక్రటరీ, ఎన్టీపీసీ ఎన్బీసీ​మెంబర్​ బాబర్​ సలీం పాషా కరపత్రాన్ని ముద్రించి శనివారం రిలీజ్​ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి పని చేసే కార్మికుల హక్కుల అమలుకు కాంగ్రెస్​ పార్టీ, ఐఎన్టీయూసీ భరోసా కల్పిస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్​ కోడ్​లను రద్దు చేయించే బాధ్యత ఐఎన్టీయూసీ తీసుకుంటుందని తెలిపారు.

పెద్దపల్లి: వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్  సేవాదళ్  అధ్యక్షుడు బొల్లి స్వామి పిలుపునిచ్చారు. శనివారంపెద్దపల్లి పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్  ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీల గురించి ప్రజలకు వివరించారు.  కార్యక్రమంలో సేవాదళ్​ ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు నీలకంఠేశ్వర్​రావు, రాష్ట్ర మహిళా సేవాదళ్  చీఫ్  ఆర్గనైజర్  భవాని త్రివేది, రాష్ట్ర కార్యదర్శి దుర్గా బాయ్, పెద్దపల్లి నియోజకవర్గ ప్రెసిడెంట్  కుమారస్వామి, ధర్మపురి నియోజకవర్గ ప్రెసిడెంట్ చంద్రయ్య,  మంచిర్యాల జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు హఫీజ్​ తదితరులు పాల్గొన్నారు.