నా కుటుంబం కేవలం ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చింది: గడ్డం వినోద్

నా కుటుంబం కేవలం ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చింది: గడ్డం వినోద్

తమ కుటుంబం ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చిందే తప్పా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లాగా అవినీతి అక్రమాలు చెయ్యడానికి కాదని గడ్డం వినోద్ అన్నారు. కేసీఆర్ సంపాదించిన దొంగ సొమ్మును ప్రజలకు ఇచ్చి.. అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ కుటుంబ పాలన కొనసాగిస్తుందని.. దాన్ని తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని చెప్పారు.

ఈ ఎన్నికల్లో ప్రజలు అన్నీ పార్టీల గురించి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకినపల్లి గ్రామంలో గడ్డం వినోద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.