గాంధీభవన్​.. గాడ్సేభవన్​ అయింది : జగదీశ్వర రావు

గాంధీభవన్​.. గాడ్సేభవన్​ అయింది :   జగదీశ్వర రావు

హైదరాబాద్​, వెలుగు : కాంగ్రెస్​ పార్టీ అసలు సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేస్తున్నదని పీసీసీ వైస్​ ప్రెసిడెంట్​ సంగిశెట్టి జగదీశ్వర్​ రావు విమర్శించారు. ముషీరాబాద్​ నుంచి పోటీ చేయాలనుకున్న ఆయన టికెట్​ దక్కకపోవడంతో అసంతృప్తిని వ్యక్తం చేశారు. బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం ఎంతో శ్రమించినప్పటికి తనకు టికెట్​ ఇవ్వలేదన్నారు. గాంధీభవన్​ను గాడ్సేభవన్​లా మార్చేశారన్నారు. డబ్బున్నోళ్లకే టికెట్ల అని ప్రశ్నించారు. గాంధీభవన్​ మెట్లు ఎప్పుడూ ఎక్కనివాళ్లకు టికెట్లు దక్కాయన్నారు. ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వబోమని చెప్తూనే ఇచ్చారన్నారు.