
- యాచకుల ఎదురుచూపులు
- గాంధీ ఆస్పత్రి ఎదుట నిత్యం అన్నదానమే కారణం
- రోడ్డు దాటుతూ ప్రమాదాల బారిన..
- ట్రాఫిక్జామ్.. పేరుకుపోతున్న చెత్త
పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రి ఎదుట నిత్యం ఎవరో ఒకరు చేస్తున్న అన్నదానం పలు సమస్యలు తెచ్చిపెడుతోంది. సిటీలోని కొందరు తమ పుట్టిన రోజు, పెండ్లి రోజు తదితర ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకొని గాంధీ హాస్పిటల్వద్దకు వచ్చి, రోడ్డుపైనే అన్నదానం చేస్తున్నారు. దీంతో ఇక్కడ యాచకుల సంఖ్య పెరిగిపోయింది. ప్రతీరోజు ప్రధాన రహదారి మధ్యలో ఉన్న మెట్రో డివైడర్ పై కూర్చొని, ఫుడ్ప్యాకెట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఫుడ్వెహికిల్స్ రాగానే రోడ్డుపై వేగంగా పరిగెడుతున్నారు.
కొన్నిసార్లు వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరిగాయి. అలాగే గాంధీ మెట్రోస్టేషన్, ఆస్పత్రి మెయిన్గేట్ ప్రాంతాల్లో ఫుడ్వేస్టేజీ, కవర్లతో చెత్త నిల్వలు పెరుగుతున్నాయి. యాచకుల కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని పోలీసులు అంటున్నారు. గాంధీ ఆస్పత్రి, మెట్రోస్టేషన్ ఆవరణలో అనాథలు, యాచకులు అనారోగ్యంతో చనిపోవడం సాధారణమైపోయింది. వారి డెడ్బాడీలను మార్చురీలో భద్రపరచడం, పోస్ట్మార్టం నిర్వహించడం, డిస్పోజ్చేయడం, కేసు దర్యాప్తు.. ఇవన్నీ వైద్య సిబ్బంది, జీహెచ్ఎంసీ, పోలీస్అధికారులకు పెద్ద తలనొప్పిగా మారాయి.