
పద్మారావునగర్, వెలుగు: ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఆబా) వర్క్షాపులో భాగంగా 20 రాష్ట్రాలకు చెందిన నోడల్అధికారులు శుక్రవారం సికింద్రాబాద్ గాంధీ దవాఖానను సందర్శించారు. హాస్పిటల్లో డిజిటల్ హెల్త్ సేవలు, రికార్డుల డిజిటల్ నిర్వహణ, వేగవంతమైన ఓపీడీ సేవలు, స్కాన్ అండ్ షేర్ విధానం, ల్యాబ్ సేవలు, టోకెన్ సిస్టమ్ ద్వారా ఓపీ చీటీల విధానాన్ని పరిశీలించారు. ఈ సేవలను గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి, డాక్టర్లు వివరించి, సందేహాలను నివృత్తి చేశారు.