‘గాంధీ’ దవాఖానలో డిజిటల్​ సేవల పరిశీలన..హాస్పిటల్​ను సందర్శించిన 20 రాష్ట్రాల నోడల్​అధికారులు

‘గాంధీ’ దవాఖానలో డిజిటల్​ సేవల పరిశీలన..హాస్పిటల్​ను సందర్శించిన 20 రాష్ట్రాల నోడల్​అధికారులు

పద్మారావునగర్, వెలుగు: ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఆబా) వర్క్​షాపులో భాగంగా 20 రాష్ట్రాలకు చెందిన నోడల్​అధికారులు శుక్రవారం సికింద్రాబాద్​ గాంధీ దవాఖానను సందర్శించారు. హాస్పిటల్​లో  డిజిటల్ హెల్త్ సేవలు, రికార్డుల డిజిటల్ నిర్వహణ, వేగవంతమైన ఓపీడీ సేవలు, స్కాన్ అండ్ షేర్ విధానం, ల్యాబ్ సేవలు, టోకెన్ సిస్టమ్ ద్వారా ఓపీ చీటీల విధానాన్ని పరిశీలించారు. ఈ సేవలను గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి, డాక్టర్లు వివరించి, సందేహాలను నివృత్తి చేశారు.