
పచ్చని ప్రకృతి సోయగానికి మారుపేరైన ఆ జిల్లాలో రైతాంగానికి ఏమైంది .. కొబ్బరి చెట్టుపై కూర్చుని రాజోలు దిండి గ్రామ సర్పంచ్ అయిన కొబ్బరి రైతు గణేష్ పూజలు చేసి వినూత్న ప్రదర్శన నిర్వహించారు.
వినాయక చవితి వచ్చిందంటే చాలు ప్రతీ గల్లీలో సందడి నెలకొంటుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలతో స్వామి వారిని కొలుస్తారు. గల్లీ గల్లీకో రకమైన వినాయకుడి విగ్రహం దర్శనమిస్తుంటుంది. చాలా రకాల రూపాల్లో, ఆకర్షణీయ రంగుల్లో ఆ వినాయకుడిని రూపొందిస్తారు. కానీ అంబేద్కర్ కోనసీమజిల్లాలో మాత్రం ఓ సర్పంచ్ కొబ్బరి చెట్టు ఎక్కి గణపతిని పూజించాడు. స్వామీ.. కోనసీమ కొబ్బరి రైతులను ప్రభుత్వాలు ఆదుకోవడం లేదు. కనీసం నీవైనా మా ప్రాంత కొబ్బరి రైతులను ఆదుకోవాలని కొబ్బరి చెట్టు ఎక్కి గణపతిని ప్రార్థించి వినూత్న నిరసన తెలిపాడు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దిండి గ్రామ సర్పంచ్ ఒక రైతు. మరి ఆయనకు ఏ కష్టం వచ్చిందో ఏమోగానీ గ్రామంలో గల ఒక చెట్టు ఎక్కి కూర్చుని గణపతి స్వామికి ఆయన కష్టమంతా చెప్పుకున్నారు. మా కష్టాన్ని తీర్చేది నీవే తండ్రి నీవు తప్ప మాకు ఎవరు దిక్కువరంటూ చెట్టు పైకి ఎక్కి ఆ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల్లోనే పచ్చని ప్రకృతి సోయగానికి మారుపేరైన అంబేద్కర్ కోనసీమ జిల్లా (Konaseema Distritct) ఇది ఆప్రాంతంలో రాజోలు దిండి గ్రామ సర్పంచ్ గా మధునూరి శ్రీనివాసరాజు ప్రజా పాలన కొనసాగిస్తున్నారు. ఆయన కొబ్బరి రైతు కూడా.. ఈ తరుణంలో కొబ్బరి చెట్టుపైకి ఎక్కి ఆయన ఒక గణపతి స్వామిని ప్రతిష్ఠించి పాలవెల్లి కట్టి కొబ్బరి రైతుల కష్టాలు నేరుగా గణపతి స్వామికి వివరించారు.
కొబ్బరి రైతులు కష్టాలు అన్ని ఇన్ని కాదు స్వామి.. ప్రస్తుతం కొబ్బరి రైతులు బతకాలంటే బరువు భారమైపోతున్న పరిస్థితి ఎదురవుతుంది ప్రస్తుతం కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరికాయలు కిందకి దిగితే రెండు రూపాయల కూలికి రూపాయి రవాణాకు దుక్కు ముందుకు మరొక రూపాయి ఇలా మొత్తం ఖర్చే అయిపోతే ఇక రైతుకు మిగిలేది ఏమిటి స్వామి అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో ఒక రూపాయి మాత్రమే తగ్గేదని ఆ తరుణంలో రైతు అడపా దడపా ఓర్చుకుని ముందుకు నడిచేవాడిని ప్రస్తుతం ఒక్కసారిగా గత కొన్నాళ్లుగా రేటు తగ్గు ముఖం పట్టడంతో కొబ్బరికాయ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది అంటూ దిండి గ్రామ సర్పంచ్ మదునూరు శ్రీనివాసరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత పరిస్థితుల రీత్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పందించి కొబ్బరికాయ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంతో మంది చిన్నకారు రైతులు ఇబ్బందులు పడతారని బయటకు చెప్పుకోలేక లోపల కొబ్బరి కొబ్బరి పంట పండించలేక కొబ్బరి రైతులు కోనసీమ జిల్లాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మధుసూధనరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొబ్బరి రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటేనే ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ప్రకృతి పలువురిని ఆకట్టుకుంటూ ఉంటుంది అటువంటి ప్రకృతికి మారుపేరైనవి కొబ్బరి తోటలు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుత తరుణంలో ఆ కొబ్బరి రైతులకు వచ్చిన కష్ట పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి ఆ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.