
నిజామాబాద్, వెలుగు : జిల్లాలో రోడ్లపై గణేశ్ మండపాలను అనుమతించబోమని సీపీ సాయి చైతన్య తెలిపారు. శనివారం తన ఆఫీస్లో వినాయక చవితి వేడుకలపై ఆఫీసర్స్తో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. గణేశ్ మండపాలకు వలంటీర్లను నియమించుకొని, ఐడీ కార్డులు ఇవ్వాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, పర్మిషన్ లేకుండా లౌడ్ స్పీకర్లు పెట్టొద్దన్నారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రార్థనా మందిరాలకు దగ్గరగా లౌడ్ స్పీకర్స్కు అనుమతి లేదన్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్ ఏర్పాటు చేయాలని ఎస్హెచ్వోలను ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టాలన్నారు. రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లు, పటాకులు, బాణాసంచా కాల్చకుండా పర్యవేక్షించాలన్నారు. డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీలు రాజా వెంకట్రెడ్డి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సతీశ్కుమార్, జిల్లాలోని సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.