విద్యపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు

విద్యపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు

ప్రతిపక్షాలు విద్వేషాలను పెంచి పో‍షిస్తే.. తాము విద్యాలయాలను పెంచి పోషిస్తున్నామని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ డిగ్రీ కాలేజీలకు అనుమతిచ్చామని ఆయన తెలిపారు. వీటిని త్వరలోనే అలాట్ చేస్తామని చెప్పారు.

85 కోట్లతో హాస్టళ్లలో వేడి నీటి వసతి ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. డిగ్రీ కాలేజీల్లో డిమాండ్ ఉన్న కోర్సులను ఏర్పాటు చేస్తున్నామని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.