ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ. 75 లక్షల విలువైన.. 250 కిలోల గంజాయిని ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి పాకెట్స్ కనిపించకుండా లారీలో కొబ్బరి పీచు నింపి.. అందులో గంజాయి తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు.
- ALSO READ| హైదరాబాద్లో మరో బాలుడు మిస్సింగ్ కలకలం
కేరళలో నివాసముండే రాజేష్ అనే వ్యక్తి గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు.