భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సెప్టెంబర్ 17న జరిగింది. ఆ రోజున ఆయనకు దేశవిదేశాల నుంచి పలువురు నాయకులు, సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో బీజేపీ కార్యకర్తలు ఊరుఊరునా వేడుకలు నిర్వహించారు. అలాగే చెన్నైలో కూడా మోడీ బర్త్ డే వేడుకలు నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 12 మంది గాయపడ్డారు.
పాడిలోని పదవట్టమ్మన్ కోయిల్ వీధి బీజేపీ కార్యకర్తలు మోడీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడానికి రైతు సంఘం నాయకుడు అయిన ముత్తురామన్ను ఆహ్వానించారు. ఆయనకు స్వాగతం పలకడానికి కార్యకర్తలు హీలియం వాయువుతో నిండిన వందల బెలూన్లను పట్టుకున్నారు. వారికి దగ్గర్లోనే ఒక వ్యక్తి పటాకులు కాల్చాడు. వాటి ద్వారా వచ్చిన నిప్పు.. బెలూన్ల మీద పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బెలూన్లు పేలిపోయాయి.
మోడీ బర్త్ డే వేడుకలు నిర్వహించడానికి కార్యకర్తలు పోలీసుల నుంచి ఎటువంటి అనమతులు తీసుకోలేదని… ఘటనలో గాయపడిన వారిని స్థానిక కిల్పాక్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించినట్లు కొరత్తూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పోర్కోడి తెలిపారు.
#WATCH Tamil Nadu: Over 30 BJP workers sustained minor injuries as helium balloons exploded during PM Modi's birthday celebrations on 17th September, in Chennai. pic.twitter.com/DnDIkx35YS
— ANI (@ANI) September 19, 2020
For More News..