అదానీ గ్రూపు షేర్ల విలువను అక్రమంగా పెంచారు : గౌతమ్​ అదానీ

అదానీ గ్రూపు షేర్ల విలువను అక్రమంగా పెంచారు : గౌతమ్​ అదానీ

న్యూఢిల్లీ: అదానీ గ్రూపు షేర్ల విలువను అక్రమంగా పెంచారని, సంస్థ మనీలాండరింగ్​ పాల్పడిందంటూ అమెరికా షార్ట్​సెల్లింగ్​ సంస్థ హిండెన్​బర్గ్ ఐదు నెలల క్రితం ఇచ్చిన​ రిపోర్ట్​పై సంస్థ చైర్మన్​ గౌతమ్​ అదానీ మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే తమ కంపెనీలపై దాడి చేశారని ఆరోపించారు. తమ కంపెనీల్లో పాలనా వ్యవహారాలు సక్రమంగా ఉన్నాయని, రూల్స్​ను పాటిస్తున్నామని స్పష్టం చేశారు. తాము రెగ్యులేటరీ రూల్స్​ను పాటించలేదన్న ఆరోపణల్లో నిజం లేదని సుప్రీంకోర్టు నియమిత కమిటీ కూడా స్పష్టం చేసిందని ఈ గ్రూప్​ ఫ్లాగ్​షిప్​ కంపెనీ అదానీ ఎంటర్​ప్రైజెస్​ లిమిటెడ్​ వార్షిక నివేదికలో ఆయన పేర్కొన్నారు. ‘రిపబ్లిక్​ డే’ జరుగుతున్నప్పుడే రిపోర్ట్​బయటికి వచ్చిందని అన్నారు. హిండెన్​బర్గ్ అదానీ గ్రూప్​పై చాలా ఆరోపణలు చేయడంతో సంస్థ కంపెనీల షేర్ల విలువ 150 బిలియన్​ డాలర్ల వరకు తగ్గింది. ‘అత్యంత సంపన్న భారతీయుడు’ అనే రికార్డు కూడా పోయింది. ‘‘రిపోర్ట్​ అంతా తప్పుల తడక. అందులో ఇచ్చినది తప్పుడు సమాచారం. పాత వివరాలు  ఇచ్చారు. మా ప్రతిష్టను దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగింది. రిపోర్ట్​ వల్ల మేం చాలా నష్టపోవాల్సి వచ్చింది. ఆరోపణలు తప్పని నిరూపించగల వివరాలన్నీ మేం ఇచ్చాం. హిండెన్​బర్గ్​రిపోర్ట్​నుంచి అక్రమంగా ప్రయోజనం పొందడానికి కొన్ని స్వార్థశక్తులు ప్రయత్నించాయి. పలు న్యూస్​ చానెల్స్​, సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్స్ తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేశాయి. తమవైపు నుంచి ఒక్కతప్పు కూడా జరిగినట్టు సుప్రీంకోర్టు కమిటీ గుర్తించలేకపోయింది. ఇండియా మార్కెట్లను అస్థిరపర్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఈ ఘటనపై సెబీ సుప్రీంకోర్టుకు ఇంకా రిపోర్ట్​ఇవ్వలేదు. మా గవ ర్నెన్స్​, డిస్​క్లోజర్​ స్టాండర్డ్స్​ గురించి మాకు పూర్తిగా నమ్మకం ఉంది”అని అదానీ వివరించారు.

దాని గురించి తెలియదు...

హిండెన్​బర్గ్​ ​చేసిన ఆరోపణల గురించి వివరణ ఇవ్వాల్సిందిగా  తమ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన అతిపెద్ద యూఎస్ ఇన్వెస్టర్లను  అక్కడి అధికారులు అడిగారంటూ వచ్చిన సమాచారం గురించి తమకు తెలియదని అదానీ గ్రూపు ఈ సందర్భంగా వివరణ ఇచ్చింది.   కంపెనీ  డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లోజర్స్ సరిగ్గా ఉన్నాయని, భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది.  అయితే రెగ్యులేటర్లు ఇన్వెస్టర్లను ఇలాంటి వివరాలను అడగటం అసాధారణ ఏమీ కాదని వివరించింది. తాము ఎన్నడూ అకౌంటింగ్​ స్టాండర్డ్స్​ను ఉల్లంఘించలేదని, అన్ని రూల్స్​ను తూచ తప్పకుండా పాటించామని స్పష్టం చేసింది. ఈ వార్తల కారణంగా అదానీ గ్రూప్​ షేర్లు మరోసారి తీవ్రంగా నష్టపోయాయి. ఇదిలా ఉంటే, హిండెన్​బర్గ్​ రిపోర్ట్​ తరువాత అదానీ గ్రూపు తీసుకున్న చర్యల వల్ల ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగిందని సుప్రీంకోర్టు కోర్టు కమిటీ పేర్కొంది. పలు అప్పులను ముందే తీర్చడం, పెట్టుబడులను పెంచడం వల్ల సంస్థకు మేలు జరిగిందని కామెంట్​ చేసింది. ‘‘ఆరోపణలకు సంబంధించి సెబీ అడిగిన అన్ని వివరాలనూ అదానీ గ్రూప్​ ఇస్తోంది. సెబీ విచారణ జరుగుతున్న సమయంలో అదానీ గ్రూపునకు సంబంధించి ఎవరూ విమర్శలు చేయకూడదు. సెబీ, సుప్రీంకోర్టు  నిర్ణయాల కోసం చూడాలి”అని కమిటీ అభిప్రాయపడింది.