గాజాలో ఆకలి కేకలు.. కాల్పుల్లో ఇద్దరు.. తొక్కిసలాటలో ఇద్దరు మృతి

గాజాలో ఆకలి కేకలు.. కాల్పుల్లో ఇద్దరు.. తొక్కిసలాటలో ఇద్దరు మృతి

డీర్ అల్ బలాహ్:  గాజాలో ఆకలి కేకలు తీవ్రమయ్యాయి. సెంట్రల్  గాజా డీర్ అల్ బలాహ్ లోని యూఎన్  గోదాముల్లోని ఆహారం కోసం   ప్రజలు ఎగబడ్డారు. కొన్ని వందల మంది ఒకేసారి గిడ్డంగుల్లోకి చొరబడ్డారు. దీంతో జనాన్ని నియంత్రించేందుకు అధికారులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. తొక్కిసలాట జరిగి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పదులకొద్దీ మంది గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు. జనం కాల్పులను సైతం లెక్క చేయకుండా పిండి ప్యాకెట్లు, కార్టన్ల కోసం ఎగబడ్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.  కాగా, గాజాపై గురువారం ఇజ్రాయెల్ బలగాలు జరిపిన కాల్పుల్లో 64 మంది చనిపోయారని గాజా హెల్త్   మినిస్ట్రీ అధికారులు తెలిపారు.