
Q4 GDP Numbers: ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలతో పాటు అమెరికా విధించిన సుంకాలు సహా అనేక సవాళ్లను ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సైతం ప్రపంచ దేశాలకు పెట్టుబడి డెస్టినేషన్ గా భారత్ మారటానికి కారణం ఇక్కడ కొనసాగుతున్న ఆర్థిక అభివృద్ధని తాజా జీడీపీ గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి.
భారత ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం నాల్గవ త్రైమాసికంలో దేశంలో జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదైంది. అలాగే మెుత్తం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇది 6.5 శాతంగా ఉన్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఈ వృద్ధి గణాంకాలు చాలా మంది నిపుణులు ఊహించినదాని కంటే అధికంగా నమోదయ్యాయి.
►ALSO READ | SEBI News: బాలీవుడ్ నటుడిపై సెబీ బ్యాన్.. 57 సంస్థలపై నిషేధం..
నాల్గవ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు అంతకు ముందు త్రైమాసికంలో కంటే ఎక్కువగా నమోదవటం గమనార్హం. అయితే ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో నమోదైన 8.4 శాతం కంటే తక్కువగా ఉందని తేలింది. ప్రస్తుతం ఉన్న వృద్ధి ఊపు రానున్న త్రైమాసికాల్లో కొనసాగే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. వాస్తవానికి అంతర్జాతీయంగా ప్రతికూలతలు కొనసాగుతున్నప్పటికీ వృద్ధికి ఢోకా ఉండదని వారు అంటున్నారు.