కామారెడ్డిటౌన్, వెలుగు : గీతా పరివార్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం గీతా జయంతి వేడుకలు నిర్వహించారు. శ్రీనివాస్నగర్ కాలనీలోని కృష్ణాధ్యాన మందిరంలో కార్యక్రమాలు జరిగాయి. గీతా పరివార్ సభ్యులు భగవద్గీతలోని 18 అధ్యాయాలను పారాయణం చేశారు. భగవద్గీతలోని సారాంశాన్ని వివరించారు.
ప్రతి ఒకరూ గీతను చదవాలని సూచించారు. గీతా పరివార్ ప్రతినిధి సోమిశెట్టి గంగారాం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కృష్ణ మందిరం పీఠాధిపతి గాంధారికర్బాబా, టెంపుల్ ప్రెసిడెంట్ శివాజీరావు, ప్రతినిధులు ప్రసాద్, రఘుకుమార్, సుదర్శన, మమత రేణుక, రాంచంధర్రావు, శ్యాంరావు, కిషన్రావులతో పాటు భక్తులు పాల్గొన్నారు.
