
రాయికోడ్ (మునిపల్లి ), వెలుగు : మునిపల్లి ఎంపీపీ ఆఫీసులో గురువారం ఎంపీపీ శైలజ అధ్యతక్షన మండల జనరల్బాడీ మీటింగ్ జరిగింది. సమావేశంలో పంచాయతీ రాజ్శాఖపైనే 30 నిమిషాల చర్చ జరిగింది. కానీ ఆ శాఖ అధికారి మధుకర్ సమావేశానికి హాజరుకాలేదు. దీంతో అతడిపై సభ్యులందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై ఎంపీడీవో హరినందన్రావు మాట్లాడుతూ.. మీటింగ్కు పీఆర్ ఏఈ రాలేదని అడిషనల్కలెక్టర్చంద్రశేఖర్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఏఈకి షోకాజ్నోటీసులు జారీ చేయాలని అడిషనల్కలెక్టర్ఆదేశించారు. సమావేశంలో ఎంపీడీవో హరినందన్ రావు, అధికారులు శివకుమార్, సంతోష్ కుమార్, దశరథ్, శైలజ, సభ్యులు పాండు, శివలీల, విజయ పాల్గొన్నారు.