పంజాగుట్ట, వెలుగు: దీర్ఘకాల జబ్బులతో ప్రతి ఏటా 25లక్షల మంది చనిపోతున్నట్టు ప్రపంచ ఆరో గ్య సంస్థ సర్వేలో వెల్లడైందని నిమ్స్ డైరెక్టర్నగరి బీరప్ప తెలిపారు. సోమవారం నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా నిమ్స్ లో కొత్తగా ఏర్పాటు చేసిన వయోజన వ్యాక్సినేషన్ క్లీనిక్ను ప్రారంభించి మాట్లాడారు. అంటువ్యాధుల నివారణలో ఇమ్యునైజేషన్పాత్ర ఎక్కువ ఉంటుందని పేర్కొన్నారు.
క్లీనిక్ ద్వారా అంటు వ్యాధులను గుర్తించి టీకా సాయంతో పూర్తిగా నియంత్రించవచ్చని తెలిపారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు రోగులకు క్లీనిక్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఆస్పత్రి జనరల్మెడిసిన్ విభాగం హెచ్ఓడీ నావల్ చంద్ర, సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ, డీన్ లిజా రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్రిజిస్ట్రార్శాంతి వీర్, జనరల్ మెడిసిన్ సీనియర్ప్రొఫెసర్సత్యనారాయణ రాజు, డాక్టర్సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.