పంజగుట్ట, వెలుగు : నిమ్స్ఆస్పత్రిలో నర్సుల కోసం జర్మన్భాష శిక్షణ ప్రోగ్రామ్ ను ప్రాంభించారు. తెలంగాణ ప్రభుత్వం ,టామ్కామ్(తెలంగాణ ఓవర్సీస్మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ )ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగుతుంది. రిటైర్డ్ఐఏఎస్ రాణికుముదిని బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విదేశాల్లో నర్సింగ్లో ఉపాధి పొందాలనుకునే వారికి శిక్షణ ఎంతో ఉపయోగ పడుతుందని ఆమె పేర్కొన్నారు.
జర్మన్భాష శిక్షణకు 40 మందిని ఎంపిక చేశారు. అనంతరం వారు జర్మన్ లో ఉపాధి పొందుతారు. నిమ్స్డైరెక్టర్నగరి బీరప్ప, టామ్కామ్ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ఇ.విష్ణు వర్ధన్రెడ్డి, డాక్టర్లిజా రాజశేఖర్,డాక్టర్ టి.గంగాధర్,ప్రొఫెసర్ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.