ఫిబ్రవరి 22 నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం

ఫిబ్రవరి 22 నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం

హైదరాబాద్ సిటీ, వెలుగు : ఆస్తి పన్ను సమస్యల పరిష్కారం కోసం ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం(పీటీపీ) కార్యక్రమం నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ  కమిషనర్ ఇలంబరితి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22 నుంచి మార్చి 29 వరకు ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సర్కిల్  ఆఫీసుల్లో పీటీపీ ఉంటుందన్నారు. 

బిల్ కలెక్టర్ల ద్వారా , ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపుల నమోదు, ఆన్‌‌‌‌లైన్ బకాయిలు సరిచేయడం, కోర్టు కేసుల పరిష్కారం,  ఐజీఆర్ఎస్​  సమస్యలు సెల్ఫ్​అసెస్ మెంట్, ఆస్తి పన్ను చెల్లింపుల్లో ఇతర సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 22, మార్చి1, 8, 15, 22, 29  తేదీల్లో డీసీ ఆఫీసుల్లో పీటీపీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.