జీహెచ్​ఎంపీని లూటీ చేస్తున్నరు

జీహెచ్​ఎంపీని  లూటీ చేస్తున్నరు
  • జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో బీజేపీ కార్పొరేటర్ల నిరసన

హైదరాబాద్ సిటీ, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి బల్దియాను లూటీ చేస్తున్నాయని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్​లో శనివారం వారు నిరసన చేపట్టారు. బడ్జెట్​కు సంబంధించిన స్టాండింగ్ కమిటీ సమావేశం జరుగుతుందని తెలుసుకొని, తొలుత వారు అక్కడి చేరుకున్నారు. కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్తున్న అధికారులను అడ్డుకున్నారు. అనంతరం కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఇలంబరితికి వినతిపత్రం అందజేశారు.