దేశ ద్రోహులకు,దేశ భక్తులకు మధ్య GHMC ఎన్నికలు

దేశ ద్రోహులకు,దేశ భక్తులకు మధ్య GHMC ఎన్నికలు

బీజేపీ అంటే సీఎం కేసీఆర్ కు వణుకు పుడుతోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. GHMC ఎన్నికలపై మంత్రులతో కేసీఆర్ మీటింగ్ నిర్వహించారని తెలిపారు. ఇందులో మంత్రులంతా బీజేపీనే గెలుస్తుందని సీఎం కు చెప్పినట్లు తెలుస్తోందని…అయితే ఆయన కొడుకు కేటీఆర్, కూతురు కవిత మాత్రం GHMC ఎన్నికలు పెడదామని అన్నట్లుగా తెలుస్తోందన్నారు. కేసీఆర్ దేశ ద్రోహుల పార్టీ MIM తో దోస్తీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. MIM ను అడ్డం పెట్టుకొని అడ్డదారిలో GHMC ఎన్నికల్లో గెలువాలని చూస్తున్నారన్నారు. ఈ ఎన్నికలు దేశ ద్రోహులకు, దేశ భక్తులకు మధ్య జరుగుతున్నఎన్నికలన్నబండి సంజయ్…దేశ భక్తులకు ఓటు వేసి గెలిపించాని ప్రజలను కోరారు.

కరోనా, వరదల టైం లో కేసీఆర్ చేతులెత్తేశారని ఆరోపించారు బండి సంజయ్. లక్షల్లో నష్టం జరిగితే ప్రజలకు రూ. 10 వేలు ఇస్తున్నారన్నారు. పేదలకు కష్టాలు వస్తే పట్టించుకోని బట్టే బాజ్ సీఎం కేసీఆర్ అని అన్నారు బండి సంజయ్. సమస్యలు పరిష్కరించకుండా సీఎం ప్రగతి భవన్, ఫామ్ హౌస్ లో పడుకున్నాడన్నారు.