
హైదరాబాద్ సిటీలో చాట్ బండార్ లో బొద్దింక వచ్చిన ఘటనతో జిహెచ్ఎంసి ఫుడ్ సెప్టీ టాస్క్ పోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శనివారం ఆగస్టు 31న వనస్థలిపురంలోని మిఠాయివాలాలో రైడ్స్ చేశారు. షాపులో ఎలాంటి పరిశుభ్రత లేదని.. కిచెన్ మొత్తం అపరిశుభ్రంగా ఉండటం గుర్తించారు.
అంతేకాదు చాట్ బండార్ లో ఉపయోగించే పదార్ధాలు కూడా నాణ్యత లేవని.. కాలం చెల్లిన పదార్ధాలు వాడుతున్నట్లు గుర్తించారు. మిఠాయివాలా షాపు ఓనర్ కు నోటీసులు చేసి ఉన్నతాధికారులకు రిపోర్టు ఇచ్చినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు లక్ష్మీ కాంత్ తెలిపారు.
ఇటీవల రెస్టారెంట్టు, హోటళ్లపై ఆహార నాణ్యతపై వస్తున్న ఫిర్యాదులు ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలో దిగారు. గత కొద్దిరోజులుగా హోటళ్లు, రెస్టారెంట్లపై రైడ్స్ నిర్వహిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించని నిర్వాహకులపై చర్యలు తీసుకుంటున్నారు.
ఇటీవల చాట్ లో బొద్దింక వచ్చినట్టు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ కావడంతో చాట్ బండార్ లపై దృష్టి సారించారు అధికారులు. తనిఖీలు నిర్వహించి నాణ్యత పాటించని యాజమాన్యంపై చర్యలు తీసుకుంటున్నారు.