
తెలంగాణలో సీజనల్ వ్యాధులపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశారు హెల్త్ మినిస్టర్ దామోదర నరసింహ. డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియాల కట్టడి పై తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. బాధితులకు మెరుగైన వైద్యాన్ని, టెస్టులను, అవసరమైన మందులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.క్షేత్ర స్థాయిలో అకస్మిక పర్యటనలు చేసి బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
డెంగ్యూ కేసులు
తెలంగాణలో జనవరి 1 నుంచి ఆగష్టు 30 2024 వరకు మొత్తం లక్షా 6 వేల356 మందికి టెస్టులు చేయగా 6,242 మందికి పాజిటివ్ వచ్చింది. 6 శాతం పాజిటివిటీ రేటు
మొదటి పది డెంగ్యూ హై రిస్క్ జిల్లాలు: హైదరాబాద్ (2,073), సూర్యపేట (506), మేడ్చల్ మల్కాజ్ గిరి (475), ఖమ్మం (407), నిజామాబాద్ (362), నల్గొండ (351), రంగారెడ్డి (260), జగిత్యాల (209), సంగారెడ్డి (198), వరంగల్ (128)
చికున్ గున్యా
తెలంగాణలో జనవరి 1 నుంచి ఆగష్టు 30, 2024 వరకు మొత్తం 3,127మందికి టెస్టులు చేయగా .. 167 చికున్ గున్యా కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 5 శాతం
చికున్ గున్యా హై రిస్క్ జిల్లా హైదరాబాద్ (74), మహబూబ్ నగర్ (20), వనపర్తి (17), రంగారెడ్డి (16), మేడ్చల్ (11)
మలేరియా
జనవరి 1 నుంచి ఆగష్టు 30 2024 వరకు మొత్తం 22లక్షల80 వేల500 మందికి టెస్టులు చేయగా.. 197 మందికి పాజిటివ్ వచ్చింది. పాజిటివిటీ రేటు 0.01 శాతం
మొత్తం జ్వరం కేసుల సంఖ్య: 2 లక్షల 99 వేల 708