వరుస ఎన్నికల నేపథ్యంలో నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమం 10వ తేదీ సోమవారం నుంచి తిరిగి ప్రారంభించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్, పన్నుల విభాగం అధికారులు, ఫోర్స్ మెంట్ డైరెక్టర్ పాల్గొనాలని కమిషనర్ దాన కిశోర్ ఆదేశించారు. ప్రతి సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ప్రజావాణి కార్యక్రమంలో పౌరుల నుంచి విజ్ఞాపనలు స్వీకరించి తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. అధికారులు ఎవరైనా హాజరు కాలేని పక్షంలో తన నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. జోనల్, సర్కిల్ కార్యాలయాల్లోనూ గ్రీవెన్స్ స్వీకరణ తప్పనిసరిగా చేపట్టాలని స్పష్టం చేశారు. మొదటి, రెండో శని వారాల్లో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా గ్రీవెన్స్ పరిష్కారంపై దృష్టి పెడతానని వెల్లడించారు. సోమవారం ఎట్టి పరిస్థితుల్లోనూ సిబ్బందికి క్యాజువల్ లీవ్ ఇవ్వొద్దని ఉన్నతాధికారులను ఆదేశించారు. వరుస ఎన్నికల నేపథ్యంలో సుమారు ఆరు నెలల నుంచి గ్రీవెన్స్ కార్యక్రమం సక్రమంగా జరగడం లేదు. ప్రస్తుతం ఎన్నికలు అన్ని పూర్తయిన నేపథ్యంలో ఇకపై ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది. .
జూన్ 10 నుంచి ప్రజావాణి
- హైదరాబాద్
- June 8, 2019
లేటెస్ట్
- హైదరాబాద్లో కుండపోత
- లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలుంటయ్
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్
- టీఎస్ఐసెట్కు రికార్డ్ స్థాయి అప్లికేషన్లు
- 1984లో పారిపోయిన ఖైదీ..40 ఏండ్ల తర్వాత దొరికిండు
- మార్చురీ కంపును భరించలేక పోతున్నం
- వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లాభం రూ. 6 కోట్లు
- ప్లాంటు నిర్మించిన దీసవాలా రబ్బర్ ఇండస్ట్రీస్
- మద్యం తాగేందుకు రూ.50 అడిగితే కొట్టి చంపారు
- మందుకొట్టిన గడ్డి తిని 80 గొర్రెలు మృతి
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్