ల్యాప్టాప్ పేలి యువతికి గాయాలు

ల్యాప్టాప్ పేలి యువతికి గాయాలు

ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఛార్జింగ్ పెట్టిన ల్యాప్-టాప్ పేలి ఓ యువతికి తీవ్ర గాయాలయ్యాయి.  బీ కోడూరు మండలం మేకవారి పల్లెకు చెందిన సుమలత వర్క్ ఫ్రం హోమ్ చేస్తోంది. చార్జింగ్ లేకపోవడంతో ల్యాప్ టాప్ చార్జింగ్ పెట్టి వర్క్ చేసిందని సుమలత పేరెంట్స్ తెలిపారు. అయితే ఒక్కసారిగా హీట్ ఎక్కిన ల్యాప్ టాప్ నుంచి మంటలు వచ్చాయి. దీంతో సుమలతకు కరెంట్ షాక్ కొట్టి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే సుమలతను పేరెంట్స్ హాస్పిటల్ కు తరలించారు. కండిషన్ సీరియస్ గా ఉందని డాక్టర్లు తెలిపారు.