హైదరాబాద్లో బాలిక మిస్సింగ్

 హైదరాబాద్లో బాలిక మిస్సింగ్

బషీర్ బాగ్, వెలుగు : బాలిక మిస్సింగ్ ఘటన కాచిగూడ పీఎస్ పరిధిలో జరిగింది. తిలక్ నగర్ లో ఉండే సోమయ్య ఓ అపార్ట్ మెంట్ లో వాచ్​మన్ గా పనిచేస్తున్నాడు. అతడి కూతురు రమ్య(15) అంబర్ పేట పోలీస్ లేన్ లోని జడ్పీఎస్ఎస్ స్కూల్ లో 9వ తరగతి చదువుతోంది. పది రోజులుగా రమ్య స్కూల్ కు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుండంతో తల్లిదండ్రులు ఆమెను మందలించారు. ఆదివారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటికెళ్లిన ఆమె తిరిగిరాలేదు.

దీంతో సోమయ్య కాచిగూడ పీఎస్ లో కంప్లయింట్ చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు. రమ్య తిలక్ నగర్ మీదుగా నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ రూట్ లో నడుచుకుంటూ వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ లో గుర్తించామని పోలీసులు తెలిపారు. ఆ దిశగా దర్యాప్తు  చేస్తున్నట్లు చెప్పారు.