
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇంటిని మంజూరు చేసింది. సైదాబాద్లోని పిల్లిగుడిసెల కాలనీ లో కట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లలో ఇంటిని కేటాయించింది. ఇంటి తాళాలు, పేపర్లను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్లు చిన్నారి తల్లిదండ్రులకు బుధవారం అందజేశారు. చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 9న ఆరేండ్ల చిన్నారిని రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి చంపేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రైలు కింద పడి నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ టైంలోనే ఫ్యామిలీకి రూ.20 లక్షల సాయం చేయడంతో పాటు తాజాగా ఇంటిని కేటాయించారు.