ఉత్తర్ ప్రదేశ్ లోని మొరాదాబాద్ లో ఓ యువతి కాళీ అవతారమెత్తింది. తనను వేధించిన పోకిరీని చితక్కొట్టింది. నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే పిడి గుద్దులతో విరుచుకుపడింది. కాలితో తన్ని తన ప్రతాపం చూపింది యువతి. కొంతకాలంగా తనను వేధిస్తుండటంతో భరించలేకే దాడి చేశానని యువతి చెప్పింది. పోకిరిని దంచికొట్టిన యువతికి స్థానికులు మద్దతుగా నిలిచారు. పోలీసులు ఘటనాస్థలికి వచ్చిన యువతి దాడి చేసిన వ్యక్తిని తమతో తీసుకెళ్లారు.
