
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: తెలంగాణ ప్రభుత్వం మహిళా వ్యవస్థాపకుల కోసం నెలకొల్పిన వీ హబ్తో పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్యూనివర్సిటీ మంగళవారం ఎంవోయూ కుదుర్చుకుంది. మహిళల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రారంభించిన ఆర్ఏఎంపీలో భాగంగా గీతం ఈ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆవిష్కరణ, వీడీసీ సెంటర్ వీ హబ్తో కలిసి పని చేస్తాయి. మహిళా ఎంటర్ప్యూనర్లు వారి వెంచర్లను డెవలప్ చేసుకునేందుకు అవసరమైన అన్ని రకాల వాతావరణాన్ని ఉమెన్ ఆక్సిలరేషన్ ప్రోగ్రాం కింద కల్పిస్తారు.
ఎంవోయూపై గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ డైరెక్టర్ దివ్య కృతి గుప్తా, వీ హబ్ డిప్యూటీ డైరెక్టర్ జాహిద్అఖ్తర్షేక్ సంతకాలు చేసి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్న ఎంవోయూ కీలక ముందడుగు అని విద్య, వ్యవస్థాపకత, సహకారం ద్వారా స్థిరమైన వృద్ధిని పెంపొందించగలమని గీతం వీసీ పేర్కొన్నారు. వీ హబ్ సీఈవో సీత, వీడీసీ కోచ్లు, ఈ క్లబ్మెంబర్లు, గీతం హెచ్వోడీలు, బీబీఏ స్టూడెంట్స్పాల్గొన్నారు.