- ఈయూ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రాసెస్ లేట్ అవుతున్న నేపథ్యంలో కార్మికులకు వెంటనే పీఆర్సీలు ప్రకటించాలని ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి డిమాండ్ చేశారు. 2 పీఆర్సీల కోసం కార్మికులు 7 ఏండ్ల నుంచి ఎదురు చూస్తున్నారని శనివారం ప్రకటనలో తెలిపారు.
రెండు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, డీఏల బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. పీఆర్సీలు, డీఏలు ఇవ్వకపోతే ఒక్కో కార్మికుడు కనీసం రూ.4లక్షలు నష్టపోతారని ఆయన గుర్తు చేశారు. సీసీఎస్ కు ఇవ్వాల్సిన రూ.1,050 కోట్లు, పీఎఫ్ ట్రస్ట్ కు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలన్నారు.