MI vs RCB: మ్యాక్స్ వెల్‌కు గాయం.. సన్ రైజర్స్‌తో మ్యాచ్ ఆడతాడా..?

MI vs RCB: మ్యాక్స్ వెల్‌కు గాయం.. సన్ రైజర్స్‌తో మ్యాచ్ ఆడతాడా..?

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ మ్యాక్స్ వెల్ కు అసలు కలిసి రావడం లేదు. బ్యాటింగ్ ఇలా వచ్చి అలా వెళ్తున్నాడు. పట్టుమని పది బంతులు ఆడకుండా కనీసం రెండంకెల స్కోర్ చేయకుండానే పెవిలియన్ కు చేరుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ విధ్వంసకర వీరుడు..దారుణంగా విఫలమవుతున్నాడు. దీనికి తోడు ముంబై ఇండియన్స్ తో నిన్న (ఏప్రిల్ 11) జరిగిన మ్యాచ్ లో  మ్యాక్స్ వెల్ కు గాయమైనట్టు తెలుస్తుంది. 

నివేదికల ప్రకారం మ్యాక్సీ.. బొటన వేలి గాయంతో ఇబ్బందిపడుతున్నట్టు తెలుస్తుంది. గురువారం(ఏప్రిల్ 11) ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గాయపడినట్లు తెలుస్తుంది. మ్యాక్స్ వెల్ గాయంపై ప్రస్తుతం ఎలాంటి స్పష్టత లేదు. దీంతో తర్వాత జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ కు మ్యాక్స్ వెల్  దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాక్స్ వెల్ దూరమైతే ముంబై మ్యాచ్ కు బెంచ్ కు పరిమితమైన కెమరూన్ గ్రీన్ తుది జట్టులో ఆడే ఛాన్స్ ఉంది.  

సన్ రైజర్స్ తో ఏప్రిల్ 15న ఆర్సీబీ మ్యాచ్ ఆడనుంది. బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తొలి 5 మ్యాచ్ లో ఫ్లాప్ షో కొనసాగించిన ఈ ఆర్సీబీ స్టార్ నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లో పరుగులేమీ చేయకుండా ఔటయ్యాడు. నాలుగు బంతులు ఎదుర్కొని శ్రేయాస్ గోపాల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆరు ఇన్నింగ్స్ లలో మ్యాక్స్ వెల్ కు ఇది మూడో డకౌట్ కాగా.. ఒక్కసారి మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగాడు. 6 ఇన్నింగ్స్ ల్లో మొత్తం 32 పరుగులు చేసి ఘోరంగా విఫలమయ్యాడు.