తల్లికి వందనం.. అంబరాన్నంటిన సంబురం

తల్లికి వందనం.. అంబరాన్నంటిన సంబురం

హైద్రాబాద్: ‘ప్రజాపాలన ఏడాది విజయోత్సవాలు’ సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్​రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్​ మార్గ్లో నిర్వహించిన డ్రోన్​ , క్రాకర్స్​ షోలు అబ్బురపరిచాయి. 

ట్యాంక్​బండ్​ చుట్టూ ఏర్పాటు చేసిన కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్​ తన పాటలతో ఉర్రూతలూగించాడు. ఫేమస్​ సింగర్లతో కలిసి సాగర తీరాన సందడి చేశాడు. 

– ఫొటోగ్రాఫర్, వెలుగు