
మిర్యాలగూడ : గ్లోబల్ జ్యువెలరీ రిటైలర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మిర్యాలగూడలో సరికొత్త స్టోర్ను ప్రారంభించింది. ఇది 2,500చదరపు అడుగుల్లో ఏర్పాటయింది. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి దీనిని ఆరంభించారు. బంగారం, వజ్రాలు, పోల్కీ, విలువైన రత్నాలు, వెండి నగల కోసం ప్రత్యేక డిజైన్లు ఉన్నాయి. ఈ స్టోర్లో ఎరా అన్కట్ డైమండ్ జ్యువెలరీ, డివైన్ హెరిటేజ్ జువెలరీ, ఎథ్నిక్స్ హ్యాండ్క్రాఫ్టెడ్ జ్యువెలరీ, రత్నాల ఆభరణాలు, విరాజ్ రాయల్, పోల్కీ ఆభరణాలు వంటివి లభిస్తాయి.
అన్ని రకాల శుభకార్యాలకు అవసరమైన నగలు ఇందులో ఉంటాయని కంపెనీ తెలిపింది. వినియోగదారులు. కస్టమర్లు కొన్ని నగలపై గరిష్టంగా 25శాతం తగ్గింపును పొందవచ్చు. పొదిగిన ఆభరణాలు, అన్ని డైమండ్ ఆభరణాలకు డైమండ్ విలువపై 25శాతం వరకు తగ్గింపు ఉంటుంది. ఈ ఆఫర్ ఈ నెల 12 వరకు అందుబాటులో ఉంటుంది.