ప్రపంచమంతా యోగా సంబురం... ఐక్యతకు ప్రతీకగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

ప్రపంచమంతా యోగా సంబురం... ఐక్యతకు ప్రతీకగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
  • 210 దేశాల్లోని  2,500 ప్రాంతాల్లో సామూహిక ఆసనాలు
  • కోల్‌‌‌‌కతా రెడ్ రోడ్‌‌‌‌పై వేలాది మందితో కలిసి యోగాసనాలు వేసిన ప్రధాని మోదీ
  • శారీరక, మానసిక దృఢత్వానికి యోగానే మార్గమని వెల్లడి

న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత్‌‌‌‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 210కి పైగా దేశాల్లోని 2,500 ప్రాంతాల్లో యోగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా అమెరికాలోని లింకన్ మెమోరియల్, యూఎన్‌‌‌‌వోతో పాటు బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, చైనా, రష్యా సహా పలు దేశాల్లోని చారిత్రాత్మక వేదికలపై వందలాది మంది యోగాసనాలు వేశారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌‌‌‌లో మొదటిసారి స్థానిక మహిళా ఇన్‌‌‌‌స్ట్రక్టర్ల నేతృత్వంలో ఈ వేడుకలు జరగడం విశేషం. 

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌‌‌‌కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్ వేదికగా నిర్వహించిన ప్రధాన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. బెంగాల్ గవర్నర్ ఆర్​ఎన్​ రవి, కేంద్ర మంత్రి ప్రతాప్‌‌‌‌రావ్ జాదవ్‌‌‌‌తోపాటు వేలాది మంది ప్రజలతో కలిసి ప్రధాని సామూహికంగా యోగాసనాలు వేశారు. దేశవ్యాప్తంగా అన్నిచోట్లా పార్టీలకతీతంగా యోగా డేను నిర్వహించారు.