- నిమిషాల వ్యవధిలో అసలు సెంటర్కు తీసుకెళ్లిన పోలీసులు
జనగామ, వెలుగు: పొరపాటున వేరే సెంటర్కు వచ్చిన ఓ స్టూడెంట్పోలీసుల సహకారంతో అసలు సెంటర్కు చేరుకొని ఎగ్జామ్రాయగలిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లికి చెందిన సిరిపురం అశ్విని మొదటిసారి జనగామలోని ఏబీవీ కాలేజీ సెంటర్లో నీట్ఎగ్జామ్ రాశారు. ప్రస్తుతం రీ ఎగ్జామ్కు పెంబర్తిలోని మహత్మా జ్యోతిబా పూలే సెంటర్ కేటాయించారు. ఆమె పొరపాటున జనగామలోని ఏబీవీ కాలేజీకి వచ్చారు.
సెంటర్లోనికి వెళ్లడానికి హాల్ టికెట్చూపించగా ఈ సెంటర్ కాదని పోలీసులు చెప్పారు. ఎగ్జామ్ ప్రారంభం కావడానికి 20 నిమిషాలో సమయం ఉండడంతో అశ్విని కంగారుపడింది. విషయం తెలుసుకున్న జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్.. పెంబర్తిలోని ఎగ్జామ్ సెంటర్కు పంపించాలని ఆదేశించారు. దీంతో ఎస్ఐ చెన్న కేశవులు వాహనంలో ఆమెను పెంబర్తిలోని సెంటర్కు తీసుకెళ్లారు. ఎగ్జామ్ సమయానికి రెండు నిమిషాలు ఆలస్యంగా రావడంతో జనగామలో మరో ముగ్గురికి నీట్ ఎగ్జామ్ రాయడానికి అనుమతించ లేదు.
