వికారాబాద్ లో నందీశ్వర మహిమ..పాలు తాగిన బసవన్న

వికారాబాద్ లో నందీశ్వర మహిమ..పాలు తాగిన బసవన్న

ఆధునిక యుగంలో కూడా దేవుడు ఉన్నాడని.. అక్కడక్కడ మహిమాన్వితమైన సంఘటన జరుగుతుంటాయి. ఇలాంటి సంఘటనే వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని బసవేశ్వర  దేవాలయంలోని నందీశ్వరుడు మహిమ చూపించాడు. శుక్రవారం గ్రామంలోని మెయిన్ బజార్లో ఉన్న బసవన్న దేవాలయంలోని నందీశ్వరుడు పాలు తాగాడు. గ్రామస్తులు దేవాలయంలో నందీశ్వరుడికి పాలు నైవేద్యంగా సమర్పిస్తుండగా అనూహ్యంగా పాలు సేవించాడు. గమించిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వింతను చూసేందుకు గ్రామస్తులతోపాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలను కూడా తరలివచ్చారు. నందీశ్వరుడు పాలు సేవించడంపై దైవ మహిమగా అభివర్ణించారు.

ఇదిలా ఉండగా.. శుక్రవారం పాలు సేవించిన నదీశ్వరుడు కొలువైన బసవన్న దేవాలయం శనివారం ఉదయం ఆలయ గర్భగుడి తప్ప మిగతా దేవాలయ ప్రాగంణం కుప్పకూలిపోయింది. గత కొన్నేండ్లుగా దేవాలయం శిథిలావస్థకు చేరుకుంది. ఈ క్రమంలో నందీశ్వరుడే ఆలయ పునర్ నిర్మాణానికి సంకేతంగా దేవాలయాన్ని కూల్చి.. సంకేతం ఇచ్చారని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు. దీంతో శనివారం ఆలయ నిర్మాణం కోసం గ్రామ సర్పంచ్ వీణ హేమంత్ కుమార్, ఉపసర్పంచ్, ఎంపీటీసీలు, తదితరులు సమావేశమై ఆలయ పునర్ నిర్మాణ కమిటిని వేయాలని నిర్ణయించారు. త్వరలోనే ఆలయ పునర్ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.