- మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ
కోల్బెల్ట్, వెలుగు : సింగరేణి సంస్థలో పనిచేసే ఉద్యోగులు రక్షణ కమిటీలో భాగస్వాములు కావాలని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ, రక్షణ కమిటీ కన్వీనర్, కార్పొరేట్జీఎం(ఈఎం) ఎన్.దామోదర్రావు సూచించారు. సింగరేణి వార్షిక రక్షణ కమిటీ పక్షోత్సవాల్లో భాగంగా గురువారం మందమర్రి ఏరియా వర్క్షాపును రక్షణ కమిటీ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీనియర్ల సలహాలు, సూచనలతో యువ ఉద్యోగులు పనిచేస్తూ సంస్థ పురోగభివృద్ధికి కృషి చేయాలన్నారు.
అంతకుముందు జీఎంలు, రక్షణ కమిటీ బృందం సభ్యులు వర్క్షాప్లో రక్షణ చర్యలను తనిఖీ చేశారు. ఉద్యోగులతో రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. రక్షణ చర్యల్లో ప్రతిభ కనబర్చిన కార్మికులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏరియా ఏస్వోటు జీఎం జీఎల్ ప్రసాద్, బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం రఘుకుమార్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్భూశంకరయ్య, ఏరియా ఇంజినీర్ బాలాజీ భగవతి ఝూ, డీజీఎం(వర్క్షాప్) దూప్సింగ్, గుర్తింపు సంఘం నాయకులు పాల్గొన్నారు. ----
