న్యూఢిల్లీ: జీఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన జీఎంఆర్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ (జీఎస్ఈడీపీఎల్) ఉత్తర ప్రదేశ్లో రూ. 5,123.37 కోట్ల స్మార్ట్ మీటర్ ప్రాజెక్ట్ను పొందింది. ఈ రాష్ట్రంలోని వారణాసి, అజంగఢ్, ప్రయాగ్రాజ్, మీర్జాపూర్తో సహా పూర్వాంచల్ ప్రాంతంలో స్మార్ట్ మీటర్లను అమర్చేందుకు పూర్వాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్ లెటర్ ఆఫ్ అవార్డ్ (ఎల్ఓఏ) జారీ చేసిందని కంపెనీ తెలిపింది.
ఈ ప్రాంతాల్లో 50.17 లక్షల స్మార్ట్ మీటర్ల ఇన్స్టాలేషన్, ఇంటిగ్రేషన్ మెయింటెనెన్స్ బాధ్యతలను నిర్వహిస్తామని కంపెనీ తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ 27 నెలలపాటు ఉంటుంది. ఆ తర్వాత 93 నెలలు ఆపరేషనల్ ఫేజ్ఉంటుంది. పూర్తి కాంట్రాక్టు మొత్తం ప్రయాగ్రాజ్– మీర్జాపూర్ జోన్లకు సుమారు రూ. 2,386.72 కోట్లు, వారణాసి – అజంగఢ్ జోన్లకు దాదాపు రూ. 2,736 కోట్లు ఉంటుందని జీఎస్ఈడీపీఎల్ తెలిపింది. యూపీ డిస్కమ్లు నిర్వహించిన ఈ-టెండర్ ప్రక్రియ తర్వాత ఎల్ఓఏ వచ్చింది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, సెటప్, ఇంటిగ్రేషన్, కమిషన్ అండ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ ఇందులో ఉంటాయి.