దేశంలోనే మొదటిసారి.. గోవాలో ఐరన్ మ్యాన్ ట్రయాథ్లాన్ రేస్

దేశంలోనే మొదటిసారి.. గోవాలో ఐరన్ మ్యాన్ ట్రయాథ్లాన్ రేస్

దేశంలోనే మొదటిసారిగా గోవాలోని మిరమార్ బీచ్ లో ఐరన్ మ్యాన్ ట్రయాథ్లాన్ రేస్ అట్టాహాసంగా ప్రారంభమైంది. నార్త్ గోవాలో సీఎం ప్రమోద్ సావంత్ ట్రయాథ్లాన్ రేస్ ను ప్రారంభించారు. 27దేశాల నుంచి సమారు వెయ్యి మంది రేస్ లో పాల్గొన్నారు. మిరామార్ బీచ్ నుంచి మొదలైన ట్రయాథ్లాన్ రేస్ లో 1.9 కిలోమీటర్ల మేర ఈతతోపాటు గోవాలోని ప్రఖ్యాత ప్రదేశాలను కలుపుతూ 21కిలోమీటర్ల మేర సైక్లింగ్ పూర్తిచేయాల్సి ఉంటోంది. 

Also Read :- అండమాన్ సముద్రంలో 4.3 తీవ్రతతో భూకంపం

స్పోర్ట్స్ టూరిజం ప్రోత్సహించేందుకు గోవాకు దక్కిన గొప్పఅవకాశమని సీఎం సావంత్ అన్నారు. అంతకుముందు పనాజీలో ప్రత్యేక ఐరన్ మ్యాన్ పోస్టల్ స్టాంప్ ను సీఎం సావంత్ రిలీజ్ చేశారు.