- స్టార్టప్ కంపెనీ సీఈవో కేసులో పోలీసుల అనుమానాలు
బెంగళూరు: నాలుగేండ్ల కొడుకుని దారుణంగా చంపిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) స్టార్టప్ సీఈవో సుచనా సేథ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పిల్లో లేదా క్లాత్తో ముఖంపై నులుమి చిన్నారిని హత్య చేసినట్లు పోస్ట్మార్టం రిపోర్టులో తేలింది. పిల్లాడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, రక్తం బయటకు రాలేదని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు బుధవారం వెల్లడించారు. ఇది ప్లాన్ ప్రకారం చేసిన మర్డర్ అని బెంగళూరు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకు గోవాలో ఆమె స్టే చేసిన హోటల్ రూమ్లో దొరికిన రెండు దగ్గు సిరప్ బాటిళ్లే నిదర్శనమని మీడియాకు తెలిపారు.
చిన్నారికి దగ్గు సిరప్ ఓవర్ డోస్ తాగించి, ఆపై గొంతు నులిమి చంపేసి ఉండొచ్చన్నారు. కస్టడీలో ఉన్న సుచనా మాత్రం.. తనకేమీ తెలియదని చెప్తోందన్నారు. కాగా, బెంగళూరుకు చెందిన 39 ఏండ్ల సుచనా సేథ్.. భర్తతో విభేదాల కారణంగా నాలుగేళ్ల కొడుకుతోపాటు విడిగా ఉంటోంది. కొడుకును భర్త చూడకూడదనే ఉద్దేశంతో ఆ చిన్నారిని గోవాకు తీసుకెళ్లి చంపేసింది. డెడ్బాడీతో బెంగళూరుకు తిరిగి వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం డెడ్బాడీని సుచనా భర్త వెంకటరామన్కు అప్పగించగా బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు.