జీఓసీఎల్​కు రూ. 766 కోట్ల ఆర్డరు

జీఓసీఎల్​కు రూ. 766 కోట్ల ఆర్డరు
  • కంపెనీ హిస్టరీలోనే అతి పెద్దది

హైదరాబాద్, వెలుగు: జీఓసీఎల్ ​సబ్సిడరీ ఐడీఎల్​ ఎక్స్​ప్లోజివ్స్​ లిమిటెడ్​కు కోల్​ ఇండియా నుంచి భారీ ఆర్డరు అందింది. ఈ ఆర్డరు కింద కోల్​ ఇండియాకు రూ. 766 కోట్ల విలువైన బల్క్​ ఎక్స్​ప్లోజివ్స్​ను సప్లయ్​ చేయా ల్సి ఉంటుంది. రాబోయే రెండేళ్ల కాలంలో కోల్​ ఇండియాకు ఈ ఎక్స్​ప్లోజివ్స్​ను సప్లయ్​ చేయాలని జీఓసీఎల్​ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ హిస్టరీలో  ఇదే అతి పెద్ద ఆర్డరని వెల్లడించింది. 

కోల్​ ఇండియాకు తాము టాప్​–టైర్​ఎక్స్​ప్లోజివ్స్​ ఇవ్వడంతోపాటు, మైనింగ్​ సర్వీసులనూ అందిస్తున్నట్లు పేర్కొంది.  ఇంతకు ముందు ఆర్డరుతో పోలిస్తే వాల్యూమ్​ పరంగా తాజా ఆర్డరు 58 శాతం పెద్దదని వివరించింది.  క్వాలిటీ ప్రొడక్టులను అందిస్తున్నామనడానికి ఈ పెద్ద ఆర్డరు నిదర్శనంగా నిలుస్తుందని జీఓసీఎల్​ సీఈఓ పంకజ్​ ఈ సందర్భంగా చెప్పారు. క్వాలిటీ స్టాండర్డ్స్​తో కొత్త ఆర్డరును నెరవేర్చనున్నట్లు పేర్కొన్నారు. 

మైనింగ్, ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ప్రాజెక్టుల కోసం ఫుల్​ రేంజ్​ బల్క్​ ఎక్స్​ప్లోజివ్స్​ను జీఓసీఎల్​ తయారు చేస్తోంది. ఆఫ్రికా, మిడిల్​ ఈస్ట్​, ఈస్ట్​ ఏషియా, యూరప్​, సౌత్​ అమెరికా మార్కెట్లకు కూడా కంపెనీ ఎగుమతి చేస్తోంది. 8 మాన్యుఫాక్చరింగ్​ ఫెసిలిటీస్​ ఉన్న జీఓసీఎల్​ 20 కి పైగా దేశాలకు ఎక్స్​ప్లోజివ్స్​ను సప్లయ్​ చేస్తుండటం విశేషం.