ప్రగతిభవన్లో ఘనంగా గోదాదేవి కళ్యాణం

ప్రగతిభవన్లో ఘనంగా గోదాదేవి కళ్యాణం

హైదరాబాద్ ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతుల ఆధ్వర్యంలో గోదాదేవి కళ్యాణం వైభవంగా జరిగింది. పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా సాగిన కళ్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు దంపతులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 

ప్రతి ఏడాది ధనుర్మాసంలో 30 రోజుల పాటు సాగే శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరుప్పావై పాశురాల పఠనం అనంతరం గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాస వ్రతం ముగుస్తుంది. పవిత్ర హృదయంతో శ్రీ రంగనాథుని నిత్య పూలమాలతో  సేవించి, ఆ శ్రీవారికే తన జీవితాన్ని అర్పించిన  మహా భక్తురాలు గోదాదేవి అని భక్తులు నమ్ముతారు.