వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామికి మంత్రి పదవి .. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభిమానుల సంబురాలు

వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామికి మంత్రి పదవి .. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభిమానుల సంబురాలు

గోదావరిఖని/పెద్దపల్లి/ సుల్తానాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: చెన్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు, కాకా కుటుంబ అభిమానులు ఆదివారం సంబురాలు నిర్వహించారు. గోదావరిఖని గాంధీ చౌరస్తాలో పార్టీ లీడర్​ కామ విజయ్ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ  చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ సీనియర్​ లీడర్​పి.మల్లికార్జున్​ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పని చేసిన కాకా కుటుంబం నుంచి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

తెలంగాణ ఉద్యమకారుడికి అసలైన గౌరవంగా తాము భావిస్తున్నామన్నారు. పార్లమెంట్​లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు ప్రవేశపెట్టేవరకు అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో లీడర్లు నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజేందర్​, మాదాసు విజయ్, సర్ధార్, కృష్ణ, కిశోర్, శ్రీకాంత్​ తదితరులు పాల్గొన్నారు. 

 బలహీన వర్గాల ఆశాజ్యోతి వివేక్​ వెంకటస్వామి

బలహీన వర్గాల ఆశాజ్యోతి మంత్రి డాక్టర్ గడ్డం వివేక్​ వెంకటస్వామి అని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నాయకుల కొనియాడారు. మంత్రిగా వివేక్​ వెంకటస్వామి ప్రమాణ స్వీకారం అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వివేక్​ అభిమానులు, కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. 

సుల్తానాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సంబురాలు 

చెన్నూరు ఎమ్మెల్యే జి. వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడంతో సుల్తానాబాద్ పట్టణంలో ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాలు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకుడు నీరటి శంకర్ ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ జి.వెంకటస్వామి (కాకా) విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజీవ్ రహదారిపై పటాకులు పేల్చి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లీడర్లు శ్రీనివాస్, కరుణాకర్, శ్యామ్, వెంకటేశం, స్వామి, సాయికిరణ్, మధు, మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.