
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని పట్టణంలో రాజీవ్ రహదారి పక్కన కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులు శనివారం ప్రారంభమయ్యాయి. గోదావరిఖని బస్టాండ్ మూలమలుపు వద్ద ఉన్న పెద్ద బిల్డింగ్తోపాటు దాదాపు 20 వరకు చిన్న షాపులను తొలగించడంతో రోడ్డు నిర్మాణ పనులకు మోక్షం లభించింది. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ ఆదేశాలతో రాజీవ్ రహదారి మెయింటనెన్స్ పనులు చూస్తున్న హెచ్కేఆర్ సంస్థ ఆధ్వర్యంలో సుమారు రూ.1.50 కోట్లతో సర్వీస్ రోడ్లను నిర్మించనున్నారు.
శనివారం బస్టాండ్ వద్ద రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, ఎండీ ముస్తఫా, రామాలయ కమిటీ అధ్యక్షుడు గట్ల రమేశ్, సతీశ్, హెచ్కేఆర్ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ రామకృష్ణ, టోల్ ప్లాజా మేనేజర్ కన్నబాబు పాల్గొన్నారు.