గోదావరి ఖని పట్టణంలో సర్వీస్​ రోడ్డు పనులు షురూ

 గోదావరి ఖని పట్టణంలో సర్వీస్​ రోడ్డు పనులు షురూ

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని పట్టణంలో రాజీవ్​ రహదారి పక్కన కొన్నేళ్లుగా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న సర్వీస్​ రోడ్డు నిర్మాణ పనులు శనివారం ప్రారంభమయ్యాయి. గోదావరిఖని బస్టాండ్​ మూలమలుపు వద్ద ఉన్న పెద్ద బిల్డింగ్‌‌‌‌‌‌‌‌తోపాటు దాదాపు 20 వరకు చిన్న షాపులను తొలగించడంతో రోడ్డు నిర్మాణ పనులకు మోక్షం లభించింది. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​ ఆదేశాలతో రాజీవ్​ రహదారి మెయింటనెన్స్​ పనులు చూస్తున్న హెచ్‌‌‌‌‌‌‌‌కేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ ఆధ్వర్యంలో సుమారు రూ.1.50 కోట్లతో సర్వీస్‌‌‌‌‌‌‌‌ రోడ్లను నిర్మించనున్నారు.

 శనివారం బస్టాండ్​ వద్ద రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, ఎండీ ముస్తఫా, రామాలయ కమిటీ అధ్యక్షుడు గట్ల రమేశ్‌‌‌‌‌‌‌‌, సతీశ్‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌‌‌‌‌కేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ ప్రాజెక్ట్​ మేనేజర్​ రామకృష్ణ, టోల్​ ప్లాజా మేనేజర్ కన్నబాబు పాల్గొన్నారు.